ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అరుణాచలం లంబోదర అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 31ననిర్వహించిన అరుణాచల నృత్యోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేటలోని నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు పాల్గొని తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. గురువు నర్మదామార్గదర్శకత్వంలో శిక్షణపొందిన విద్యార్థులు సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలకు ప్రతీకగా నిలిచే విధంగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ నైపుణ్యం, భావప్రకటన, లయాత్మకతతో నృత్యోత్సవానికి మరింత శోభను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థులను అభినందించగా తల్లిదండ్రులు, కళాప్రియులు గురువు నర్మదా శిక్షణను, నటరాజ కళాక్షేత్రం సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని స్థానిక ప్రజలువిద్యార్థులను ఆశీర్వదించారు.
Admin
E Nivas News