Thursday, 30 July 2026 01:32:18 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణం తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భర్త మృతి...

విషాదంలో కుటుంబ సభ్యులు...

Date : 14 February 2026 09:22 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో భార్య మరణం తట్టుకోలేక గంటల వ్యవధిలోని భర్త మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దహేగాం మండలం కమ్మర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్ 32 కు బెల్లంపల్లి మండలం గురజాల కు చెందిన సువర్ణ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. వినోద్ కేబుల్ టీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. సువర్ణ గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించింది శుక్రవారం అంతక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్ ఉన్నట్టుండి ఒకసారిగా కింద పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దహేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వినోద్ అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో గంటల సమయంలో భార్యా భర్తలు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బంధువుల రోదనతో గ్రామం విషాదవదనంగా మారింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :