ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా విధులు నిర్వర్తించిన నడిమెట్ల రాజన్న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 2008 సంవత్సరంలో టిడిపి తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేపల్లి రాజలింగయ్య పై విజయం సాధించారు. ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసి ప్రజల మన్ననలు పొందారు. తర్వాతఉత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వ్ కావడంతో సర్పంచ్ టిడిపి అభ్యర్థి గా కమటం స్వామిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంచగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి మడిపల్లి స్వామి పై గెలవడానికి తీవ్రంగా కృషి చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కమటం స్వామి గెలుపొందగా , ఉప సర్పంచ్ పదవిని కూడా నడిమెట్ల రాజన్న చేపట్టాడు. ఆయన మృతి పట్ల పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Admin
E Nivas News