ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ పార్టీని మరింత బల్ల బోధన్ చేయడానికి నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని నందనవనంలో నిర్వహించిన బిఎల్ఎ-2 సమీక్ష సమావేశాల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ బూత్ స్థాయి కార్యకలాపాలు, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యల పరిష్కారంపై చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పలు అంశాలపై సలహాలు సూచనలు అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బిఎల్ఎ-2 సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News