ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలుగుదనాన్ని నింపే మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొనితెలంగాణ వ్యాప్తంగా ఊరు, వాడ గురువారం మకర సంక్రాంతి వేడుకలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉదయాన్నే మహిళలు, యువతులు, పిల్లలంతా ఇండ్ల ముందు లోగిళ్ళను ఆకర్షణీయమైన రంగులతో పలు రకాల రంగవల్లులను వేయడంతో చాలా ఆకట్టుకున్నాయి. రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలను కూడా పెట్టారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వారికున్న స్థలంలోనే అత్యంత సుందరమైన ముగ్గులు వేశారు.
అలాగే యువకులు పెద్దలు పిల్లలంతా గాలిపటాలను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. డుడు బసవన్న గంగిరెద్దుల ఆటలతో వాడలన్నీ మార్బ్రోగాయి. అలాగే హరిదాసులు సైతం ఇంటింటా వచ్చి ప్రాచీన రీతిలో పాటలు పాడుతూ భిక్ష తీసుకున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులంతా ఆనందంగా పలు రకాల పిండి వంటలు చేసుకొని గడిపారు. సంక్రదాన్ని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్న ప్రజలంతా తమ ఊళ్ళకు వెళ్లడంతో పట్టణాల్లో జన సమూహం తక్కువగా కనిపించింది. మహిళలంతా తమ బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి రకాల వాయినాలు ఇచ్చుకొని సంస్కృతిని ప్రతిబింబజేశారు. పలు పట్టణాల్లో క్రీడలను కూడా నిర్వహించారు.
Admin
E Nivas News