Friday, 17 April 2026 05:01:37 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఆనందోత్సాహాల మధ్య మకర సంక్రాంతి వేడుకలు..

కనువిందు చేస్తున్న రంగవల్లులు...

Date : 15 January 2026 09:13 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలుగుదనాన్ని నింపే మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొనితెలంగాణ వ్యాప్తంగా ఊరు, వాడ గురువారం మకర సంక్రాంతి వేడుకలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉదయాన్నే మహిళలు, యువతులు, పిల్లలంతా ఇండ్ల ముందు లోగిళ్ళను ఆకర్షణీయమైన రంగులతో పలు రకాల రంగవల్లులను వేయడంతో చాలా ఆకట్టుకున్నాయి. రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలను కూడా పెట్టారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వారికున్న స్థలంలోనే అత్యంత సుందరమైన ముగ్గులు వేశారు.

అలాగే యువకులు పెద్దలు పిల్లలంతా గాలిపటాలను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. డుడు బసవన్న గంగిరెద్దుల ఆటలతో వాడలన్నీ మార్బ్రోగాయి. అలాగే హరిదాసులు సైతం ఇంటింటా వచ్చి ప్రాచీన రీతిలో పాటలు పాడుతూ భిక్ష తీసుకున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులంతా ఆనందంగా పలు రకాల పిండి వంటలు చేసుకొని గడిపారు. సంక్రదాన్ని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్న ప్రజలంతా తమ ఊళ్ళకు వెళ్లడంతో పట్టణాల్లో జన సమూహం తక్కువగా కనిపించింది. మహిళలంతా తమ బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి రకాల వాయినాలు ఇచ్చుకొని సంస్కృతిని ప్రతిబింబజేశారు. పలు పట్టణాల్లో క్రీడలను కూడా నిర్వహించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :