ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై శుక్రవారం తెలంగాణకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, అవి పార్లమెంట్ రికార్డుల నుండి వెంటనే తొలగించాలని స్పీకర్ను కోరినట్లు వంశీకృష్ణ తెలిపారు. స్పీకర్ ఈ విషయాన్ని గంభీరంగా పరిగణించి, ఆ వ్యాఖ్యలు తగవని అంగీకరించి, వాటిని రికార్డుల నుండి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అనేక బలిదానాలు, పోరాటాల ఫలితమని, అలాంటి రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీయే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వంశీకృష్ణ స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ బాధ్యత అని, రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ వేదికగా ఎల్లప్పుడూ పోరాడుతామని ఆయన పునరుద్ఘాటించారు.
Admin
E Nivas News