ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు విద్యతో పాటు పలు అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ఎంపీడీవో ప్రత్యేక అధికారి సరోజ సూచించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో రెండవ రోజైన మంగళవారం విద్యార్థినిలకు క్విజ్, ఆర్ట్, డిబేట్, ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ముందుగా మరోసారి ప్రత్యేక అధికారి విద్యార్థుల సంక్షేమంపై సమావేశ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థుల భోజనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండ జీవరత్నం, వసతి గృహ సంక్షేమ అధికారి రేణుక, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News