ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మి కులు సమ్మెకు సిద్ధమయ్యా రు.తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు అవు తున్న ఇప్పటికీ ప్రభుత్వం చర్చలు జరుపకపోవడం విచారకరమన్నారు. దీంతో డిమాండ్లను పరిష్కరిం చాలంటూ 22 బుధవారం నుంచి సమ్మె చేయాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేపడుతున్నామని సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని అన్నారు. నేటి వరకు ఆర్టీసీ అధికారులు,కాని ప్రభుత్వం కానీ తమను చర్చలకు పిలవలేదని కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్ట లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలుపెట్టలేదన్నారు. కాలయాప న కోసమే విలీన కమిటీ వేశారు. కష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే మూసి నది అభి వృద్ధి ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో ఆర్టీసీని లేకుండా చేయాలని, ప్రయత్నిస్తున్నారని ప్రవేటు వ్యక్తులకు ఆర్టీసీ భూముల ను దారా దత్తం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు తలపెట్టబోయే ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని వారు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గమనించిన ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. చర్చలు విఫలం కావడంతో తీసి ఎస్ ఆర్ టి సి కార్మికులు అర్ధరాత్రి నుండి సమ్మెను మొదలుపెట్టనున్నారు.
Admin
E Nivas News