Saturday, 25 April 2026 09:19:22 PM
# ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ # బెంగళూరు బోర్డు పరీక్షల్లో పాములపాడు విద్యార్థిని ప్రతిభ

21 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె...

డిమాండ్ పరిష్కరించేంతవరకు సమ్మె ఆపేది లేదు

Date : 21 April 2026 10:25 PM Views : 33

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మి కులు సమ్మెకు సిద్ధమయ్యా రు.తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు అవు తున్న ఇప్పటికీ ప్రభుత్వం చర్చలు జరుపకపోవడం విచారకరమన్నారు. దీంతో డిమాండ్లను పరిష్కరిం చాలంటూ 22 బుధవారం నుంచి సమ్మె చేయాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేపడుతున్నామని సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని అన్నారు. నేటి వరకు ఆర్టీసీ అధికారులు,కాని ప్రభుత్వం కానీ తమను చర్చలకు పిలవలేదని కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్ట లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలుపెట్టలేదన్నారు. కాలయాప న కోసమే విలీన కమిటీ వేశారు. కష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే మూసి నది అభి వృద్ధి ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో ఆర్టీసీని లేకుండా చేయాలని, ప్రయత్నిస్తున్నారని ప్రవేటు వ్యక్తులకు ఆర్టీసీ భూముల ను దారా దత్తం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు తలపెట్టబోయే ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని వారు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గమనించిన ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. చర్చలు విఫలం కావడంతో తీసి ఎస్ ఆర్ టి సి కార్మికులు అర్ధరాత్రి నుండి సమ్మెను మొదలుపెట్టనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :