ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నవంబర్ 3 నుంచి మంచిర్యాల జిల్లాలోని రెండు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలం మహేశ్వరి కాటన్ మిల్లు, దండేపల్లి మండలం వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లుల్లో ఈ కొనుగోళ్లు జరుగుతాయని, పత్తి రైతులు తప్పనిసరిగా కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతే తమ పత్తిని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం పత్తి రైతు గిట్టుబాటు ధర కల్పిస్తుందని రైతులు దళారుల వలలో పడి మోసపోవద్దని తెలిపారు.
Admin
E Nivas News