ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : చిలకలూరి గుట్ట నుంచి గద్దపైన కొలువుదీరిన సమ్మక్క మేడారం మహాజాతర గురువారంతో పరిపూర్ణంగా దర్శనాలు భక్తజనానికి ప్రారంభమయ్యాయి. సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి బయలుదేరగాలని జిల్లా ఎస్పీ ఏకే -47 తో గాలిలో కాల్పులు జరపగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ మ్మవారిని ఆహ్వానించగా, అశేష జన సందోహం మధ్య నుండి నాలుగు అంచల పోలీసు భద్రత మధ్య కుంకుమ భరణి రూపంలో గద్దె వద్దకు రాగానే కోయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గద్దెలపై కొలువు తీర్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల యొక్క కోరిక సమ్మక్క జన సందోహంలోకి రాకతో పూర్తిస్థాయిలో నెరవేరింది. భక్తులంతా సమ్మక్క సారలమ్మ పగడికిద్దరాజు గోవిందరాజులను దర్శించుకుని మొక్కులు అప్పజెప్పుకుంటున్నారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి స్వాగతం పలుకుతూ వారి యొక్క మొక్కలు చెల్లించుకున్నారు. సమ్మక్క రాకతో కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. వన దేవతలను దర్శించుకోవడానికి చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తల్లి రావడంతో మేడారం ఇసుక వేస్తే రాలనంత పరిస్థితి ఏర్పడింది. భక్తులంతా ముందు మేడారం చేరుకోగానే జంపన్న వాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శనం చేసుకుని బంగారం బెల్లం సమర్పించుకుంటున్నారు. అలాగే నైవేద్యం రూపంలో మేకలు కోళ్లను బలి ఇస్తూ అమ్మవారికి మొక్కిన మొక్కులను అప్పజెప్పుతున్నారు. మేడారంలో వనదేవతల ప్రత్యేకత ఏమంటే దేవతల వద్ద ఏమి కోరిక కోరిన కూడా కచ్చితంగా నెరవేరుతుందని నమ్మకంతోని నేడు కోట్లాదిమంది ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని పునీతులు అవుతున్నారు. వచ్చిన భక్తులకు సైతం పోలీస్ యంత్రాంగం 500 అంచల పోలీసు భద్రత ఏర్పాటు చేసి డేగ కన్నుతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను పోలీసులు పరిశీలిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అమ్మవార్లను దర్శించుకుని వారి ఎత్తు బెల్లం(బంగారం) సమర్పించుకున్నారు. వీరికి మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ఇప్పటికీ మేడారం వైపే దారులన్నీ పలు రకాల వాహనాలతో క్రిక్కిరిసిపోయాయి. అటు బస్సులే కాకుండా భక్తులు తమ సొంత వాహనాలలో కూడా భారీగా తరలి రావడంతో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలను ఆపి కాలినడకన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చిన భక్తులకు పలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారు. ఏది ఏమైనా రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే వనదేవతల జాతర ఈ ఏడు ఎప్పుడు ఎరగని స్థాయిలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.
Admin
E Nivas News