Thursday, 30 July 2026 08:16:38 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..

జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య

Date : 17 June 2026 09:31 PM Views : 62

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని,నాణ్యత ప్రమాణాలనుఖచ్చితంగా పాటించాలని తెలిపారు.విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్మాణ పనులు నిర్వహించాలని, నిర్మాణ సామగ్రి నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకుఅందిస్తున్న వసతులు,విద్యా సదుపాయాలు,భోజనం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం,పరిశుభ్రత పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు,అకడమిక్ రికార్డులు,ఇతర పరిపాలన రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం,క్రమశిక్షణ, నాణ్యమైన బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.వంటగది, స్టోర్ రూమ్,తరగతి గదులు,వసతి గదులు, ఇతర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థినుల సంక్షేమం ,భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు ,గుత్తేదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :