ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాలలో 14 బీటీ రోడ్ల నిర్మాణాలకు (12 సిఆర్ఆర్, 2 డిఎంఎఫ్ టి గ్రాంట్ల ద్వారా) రూ. 43.93 కోట్ల నిధులను బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని నియోజకవర్గంలోని నర్సింగాపూర్ జెడ్పీ రోడ్ నుండి పాత రేగులగూడెం వరకు రూ. 2.30 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ కాటారం నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం వరకు రూ. 3 కోట్లు, నాగారం ఎక్స్ రోడ్ నుండి కన్నాల వేంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు రూ. 2.50 కోట్లు, వల్లెంకుంట నుండి మానేరు వరకు రూ. 1.80 కోట్లు, గుమ్నూర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి దొంతులపల్లి మీదుగా పిడబ్ల్యుడి రోడ్డు కాకర్లపల్లి వరకు రూ. 3.75 కోట్లు (డిఎంఎఫ్ టీ గ్రాంటు), మహదేవ్ పూర్ నుండి గోదావరి వయా ఫకీర్ వాడ వరకు రూ. 3 కోట్లు, హరిపురం నుండి పోతారం వయా ట్యాంక్ బండ్ రూ. 2 కోట్లు, చిన్న ఓదెల నుండి మానేరు వరకు 1 కోటి, Widening & Strenghthening రోడ్డు పెంచికల్ పేట్ నుండి ఎఫ్ సిఐ గేట్ వరకు రూ. 9.90 కోట్లు (Old 4cr), (డిఎంఎఫ్ టీ గ్రాంటు), పిడబ్ల్యుడి రోడ్ నుండి విలోచవరం వయా అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు రూ. 1.82 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ నుండి గోదావరి వయా పలిమెల వరకు రూ. 3.24 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు సుబ్బయ్యపల్లి నుండి ఆర్ అండ్ బి రోడ్డు ప్రతాపగిరి వరకు రూ. 3.50 కోట్లు, బిటి రోడ్డు బెగ్లూర్ నుండి గోదావరి వయా హనుమాన్ టెంపల్ వరకు రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయి. మంజూరైన 14 బిటి రోడ్లకు సంబంధించిన ఆయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News