ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సి ఎస్ ఐ చర్చి ఆవరణలో ప్రత్యేక 25, 26 తేదీలలో ఏసు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయజాతరను ఘనంగా నిర్వహించే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో కూడా జాతర కోసం చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చిని సుందరంగా ముస్తాబు చేశారు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాటను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్ పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందరిని ఆహ్వానించారు. 25 సాయంత్రం ఉత్కూర్ చౌరస్తా నుండి భాజా భాజంత్రీల మధ్య క్రైస్తవ సంఘస్తులు భారీగా ర్యాలీ నిర్వహిస్తూ పాటలు ఆలపిస్తూ చర్చి వద్దకు చేరుకుంటారు. అనంతరం ఏడు గంటలకు సిలువ వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాతరకు ముఖ్యఅతిథిగా మెదక్ బిషప్ డాక్టర్ రూబెన్ మార్క్ హాజరవుతారు.
Admin
E Nivas News