ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోనే సాధ్యమని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్నలు అన్నారు. శుక్రవారం మంథని మండలం పుట్టపాక గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎస్సి సబ్ ప్లాన్ నిధులు రూ.5లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి ఎస్సి సబ్ ప్లాన్ నిధులు రూ.2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజి లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామాల అభివృద్దికి శ్రీకారం చుట్టామని ,రాబోయే రోజుల్లో మంత్రి శ్రీధర్ బాబు సహకారం తో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుoదన్నారు. ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మంథని రాకేశ్, సింగిల్ విండో డైరెక్టర్ పెద్దిరాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చాట్లపల్లి సంతోష్, మాజీ సర్పంచులు అయిలి శ్రీనివాస్, కల్వల రాజేశం, నాయకులు సవాయి గణేష్, చాట్లపల్లి మధు, కన్నూరి రాజబాపు, ఎండి హుస్సేన్ భీ, శీలం ప్రభాకర్, కన్నూరి సుదర్శన్, కన్నూరి పోచయ్య, కన్నూరి రాజయ్య, కన్నూరి తిరుపతి, ఇల్లుటం వెంకటేష్, రోడ్ద నరేష్, మంథని శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News