Thursday, 30 July 2026 01:33:16 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై రాష్ట్ర డీజీపీ దృశ్య సమీక్ష

మున్సిపల్ ఎన్నికల చట్టాలపై పోలీసు అధికారులకు లీగల్ అవగాహన

Date : 03 February 2026 11:14 PM Views : 148

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేకనిఘానేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అధికారులతో మంగళవారం దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు జిల్లాలోని పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికలను పూర్తి శాంతియుతంగా, స్వచ్ఛంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి స్థాయి పోలీసు అధికారి పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని డీజీపీ ఆదేశించారు. నామినేషన్ దశ నుంచి పోలింగ్, కౌంటింగ్, ఫలితాల అనంతరం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుజరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, రిస్క్ ఎలిమెంట్స్‌పై ముందస్తు బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండల, పోలీస్ స్టేషన్ వారీగా సమస్యాత్మక మరియు అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాన కలిగి ఉండాలని, ఎన్నికల రోజు మరియు కౌంటింగ్ రోజున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. విజేత ర్యాలీలపై ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. మున్సిపల్ ఎన్నికల చట్టాలపై రాష్ట్ర పోలీసు లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు పోలీసు అధికారులకు సమగ్ర లీగల్ అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ అడిగిన ప్రశ్నలకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న భద్రతా చర్యలు, బందోబస్తు ప్రణాళికలు, పోలీసు బలగాల వినియోగంపై వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, ఆర్ఐలు రామకృష్ణ, శైలేందర్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :