ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ఎరువులను ఊరూరా సులభంగా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ బాధ్యతలను అప్పగిం చాలని ప్రభుత్వం యోచిస్తుంది. మహిళా సంఘాలకు త్వరలో ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించ నుంది.ఈ కార్యక్రమం అమలు కోసం ప్రణాళి కలు రచిస్తోంది.ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసే మహిళా సంఘాలను గుర్తించనుంది. వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. రాష్ట్రంలో దాదాపు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని ఎంపిక చేసి లైసెన్స్ అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే వీరికి యూరియా యాప్ వినియోగంపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కోసం 8,126 సొంత భవనాలను నిర్మించేం దుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవు తోంది. ఈ కేంద్రాల్లోనే ఎరువులు నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.దీని వల్ల రైతులు తమ గ్రామంలోనే ఎరువులు కొనుగోలు చేయ వచ్చు. ఇందుకోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మహిళా సంఘాల ద్వారా యూరియా పంపిణీ చేస్తే రైతులకు చాలా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Admin
E Nivas News