Thursday, 30 July 2026 04:53:11 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి రంగం సిద్ధం..

Date : 09 July 2026 11:45 PM Views : 53

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ఎరువులను ఊరూరా సులభంగా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ బాధ్యతలను అప్పగిం చాలని ప్రభుత్వం యోచిస్తుంది. మహిళా సంఘాలకు త్వరలో ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించ నుంది.ఈ కార్యక్రమం అమలు కోసం ప్రణాళి కలు రచిస్తోంది.ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేసే మహిళా సంఘాలను గుర్తించనుంది. వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. రాష్ట్రంలో దాదాపు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని ఎంపిక చేసి లైసెన్స్ అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే వీరికి యూరియా యాప్ వినియోగంపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కోసం 8,126 సొంత భవనాలను నిర్మించేం దుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవు తోంది. ఈ కేంద్రాల్లోనే ఎరువులు నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.దీని వల్ల రైతులు తమ గ్రామంలోనే ఎరువులు కొనుగోలు చేయ వచ్చు. ఇందుకోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మహిళా సంఘాల ద్వారా యూరియా పంపిణీ చేస్తే రైతులకు చాలా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :