ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాజన్నారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అక్కపల్లిగూడెంలో 11 గ్రామపంచాయతీల సర్పంచులకు మరియు పాఠశాల పోషకుల నుండి గెలుపొందిన ముగ్గురి వార్డ్ సభ్యుల కు వారి వార్డుల నుండి పాఠశాలకి విద్యార్థులను పంపుతున్న వార్డ్ సభ్యులకు బుధవారం సన్మానం చేశారు. పాఠశాలలో జరుగు వివిధ కార్యక్రమాల చిత్రమాలికను సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబ సభ్యులతో కూడిన చిత్రాలను ముద్రించిన క్యాలెండర్ వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామని సర్పంచులు వార్డు సభ్యులు హామీ ఇచ్చారు . రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పనలో తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమలో పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్, జన్నారం సర్పంచ్ అజ్మీర కళావతి, నందు నాయక్, కిష్టాపూర్ సర్పంచ్ వాసలా నరేష్, బాదం పెళ్లి సర్పంచ్ సామల విజయలక్ష్మి, లక్ష్మీరాజం దేవునిగూడెం సర్పంచ్ రామ్ టైంకి రాజేష్, లో తొర్రే సర్పంచ్ అజ్మీర శంకర్ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమాదేవి మరియు ప్రధానోపాధ్యాయులు జాజా ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శెట్టి రాజశేఖర్, అంకం కరుణ, పనస మౌనిక, సుదీప, శిరీష, తేజ, శ్రీలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News