ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నివాళులు అర్పించి స్మరించుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవనే తన ప్రాణంగా భావించి, న్యాయం నిష్పక్షపాతానికి ప్రతీకగా నిలిచిన మాజీ శాసన సభాపతి ఈప్రాంత అజాత శత్రువుగా ఉన్నారని, ఈ ప్రాంతంలోని రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో కట్టించారాని, ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం ప్రజా ప్రతినిధులకి మార్గదర్శకo ఆయన ఆశయాలు సమాజానికి దీపస్తంభాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిన్నల బ్రహ్మా రెడ్డి, కమిటీ సభ్యులు పిల్ల మరి రమేష్, శ్రీనివాస్, జిల్లాఅధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, జిల్లా ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న, కుంభం రమేష్ రెడ్డి, ఉడుముల విజయ, సర్పంచ్ కిషన్ నాయక్, డబ్బేటా దేవేందర్, ఉప్పుల రజిత, సోదారి దేవయ్య సర్పంచ్, కుమార్ యాదవ్, ప్రభు సుందిళ్ల, కొండగుర్ల రామ నారాయణ, బీరెల్లి మహే ష్,బేడిక లక్ష్మి,గాలి సమ్మ య్య,రైతులు మార్కెట్ క మిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News