ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో దొంగలు పడ్డారు. ఏకంగా రూ"1.40 కోట్ల జీతం భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకో ణాన్ని అధికారులు వెలికితీశారు. సుమారు రూ. 1,40, 18,308 మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచా రణలో తేలింది. గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి, మరణిం చిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఐఎఫ్, ఎమ్ఐఎస్, ఎంప్లాయీ ఐడీలను దుర్వినియోగం చేసి ఇఫమిస్ పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చాడు. ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్ నంబర్ల ను అనుసంధానించడం ద్వారా 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందినట్లు వెల్లడైంది.అక్రమంగా పొందిన నిధుల తో వ్యక్తిగత రుణాలు తీసుకోవడంతో పాటు నగదును వ్యక్తిగత అవ సరాలకు వినియోగించి నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేర కు బాధ్యుడైన పోలీసు ఉద్యోగిపై కరీంనగర్ I-టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆలం గౌష్, మాట్లాడుతూఈ కుంభ కోణంలో మరెవరికైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై అంతర్గత విచారణ కొనసాగుతోంద ని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటా మని అయన తెలిపారు.
Admin
E Nivas News