ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : ఈనెల 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, బీఈడీ, పీజీ, ప్రభుత్వ యూనివర్సిటీల బందును విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతి బస్సు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటి వరకు విద్యార్థుల స్కాలర్షిప్, రియంబర్స్మ్ంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7800 కోట్ల స్కాలర్షిప్లో పెండింగ్లో ఉండడంతో పేద విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం విద్యాశాఖ మంత్రి లేరని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కన్వీనర్ పెద్దపులి బాసు, మండల నాయకులు వినయ్, ప్రవీణ్, యాకన్న, మహేశ్వరి, అనిత తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News