Friday, 31 July 2026 04:34:45 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతం...

Date : 18 October 2025 07:27 PM Views : 307

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 42 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం బంద్ విజయవంతమైనది. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలు సినిమా హాలు పెట్రోల్ బంకులు పాఠశాలలు తదితర సంస్థలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు ఆయా జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ 42 శాతం బీసీ లకు రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు.బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ రకాల కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బీసీలకు న్యాయమైన డిమాండ్ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉందని దీనికి కాంగ్రెస్ పార్టీ,బిజెపి పార్టీ, టీఆర్ఎస్ నాయకులు, కుల సంఘాల నాయకులు మద్దతు తెలుపుతుందని వారు తెలిపారు.ఏమైనప్పటికీ కాంగ్రెస్,బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు బీసీల పక్షపాతి అని బీసీల న్యాయమైన రిజర్వేషన్లు అందే వరకు బీసీల పక్షాన నిలబడి పోరాడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేంతవరకు కలిసికట్టు పోరాడుతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఆయా కుల సంఘాల సైతం మద్దతు తెలిపాయి. ఈ అఖిలపక్ష నాయకులు శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకోలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు జిల్లా మండల కేంద్రాల్లో అఖిలపక్ష నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మండలాల అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :