Thursday, 30 July 2026 01:27:57 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అమ్మన మడుగు ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీరందడం లేదు... ! నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్...

తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయకుమార్

Date : 07 July 2026 11:31 PM Views : 56

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అమ్మనమడుగు ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీరందడం లేదని నిధుల దుర్వినియోగంపై విచారణ జలపాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలం కేస్లాగూడలోని 'అమ్మన మడుగు ప్రాజెక్టు' ద్వారా ఒక్క ఎకరం వ్యవసాయ భూమికి కూడా సాగునీరు అందించడంలో గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము పూర్తిగా విఫలమయ్యాయని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వైఫల్యాలను, నిధుల అక్రమాలను ఎండగట్టారు. "దాదాపు 25 సంవత్సరాల క్రితమే 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ చెరువును (ప్రాజెక్టు) నిర్మించారు. కానీ, దీనికి దిగువన ఉన్న కేస్లాగూడ, కేరామెరి గ్రామస్థుల భూములకు నేటికీ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందడం లేదు. గతంలోనూ ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినట్లు ప్రకటించారు, కానీ ఆ నిధులు ఎటు పోయాయో, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పటికీ పత్తా లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రిపేర్ల నిమిత్తం రూ. 11.76 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపిందని గుర్తు చేశారు. కానీ, నేటి వరకు ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసి అభివృద్ధి చేయలేదని, ఎలాంటి రిపేర్ పనులు చేపట్టలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు కాలువలను కూడా అసంపూర్తిగా తవ్వించి అలానే వదిలేశారని, ఆ కాలువల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే నిధులు మంజూరు చేసినట్లుగాఅనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అమ్మన మడుగు ప్రాజెక్టును త్వరితగతిన అభివృద్ధి చేసి, రైతులకు సాగునీరు అందించాలి. ఈ ప్రాజెక్టు పేరుతో గతంలో మరియు ప్రస్తుతం మంజూరు చేసిన నిధులపై *ప్రత్యేక విచారణ జరిపించాలి. ప్రభుత్వం మరియు అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి స్పందించకపోతే, కేస్లాగూడ గ్రామ పంచాయతీ, కేరామెరి గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రజలందరినీ, రైతులను ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :