Saturday, 25 April 2026 10:57:09 PM
# ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి...! 17 మంది పేకాట రాయుళ్లు అరెస్టు...

Date : 21 April 2026 10:20 PM Views : 98

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు గత కొంతకాలంగా రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పోలీసులు అర్థరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం కరీంనగర్ పట్టణం శుభాష్ నగర్ లోని రెడ్డి హాస్టల్ సమీపంలో ఓ ఇంట్లో 17 మంది వ్యక్తులతో కలిసి పేకాట ఆడుతున్నారని కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పేకాట రాయుళ్లని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 6,75,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే పట్టుబడిన వారిలో రైస్ మిల్లు నిర్వాహకుల అసోసియేషన్ సభ్యులు, తిమ్మపూర్ మండలానికి చెందిన సర్పంచులు, అధికార పార్టీ నాయకులు, వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖులు, విలేకరులు కూడా ఉన్నారని తెలుస్తోంది. పేకాట రాయుళ్లు పట్టుబడ్డ ప్రదేశం 3 టౌన్ పరిధిలోకి వస్తుంది అని పై అధికారులు ఆదేశించడంతో వారి సూచన మేరకు రూరల్ పోలీసులు ఈ కేసును 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. 3 టౌన్ పోలీసులు ఇప్పటి వరకు ఈ ఘటన పై గంటలు గడుస్తున్నా వ్యక్తుల వివరాలు, డబ్బు వివరాలు, ఇతర సమాచారం 영령 ఈ కేసు నుంచి గోప్యంగా ఉంచడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పించాలంటు పోలీసులకు అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది అని తెలుస్తోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :