ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సహకార సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన శక్తిగా అవతరించాయని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మంథని సహకార సంఘం కార్యాలయ ఆవరణలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహకార సంఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నెహ్రు జన్మదినం సందర్భంగా నవంబర్ 14 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ సారి సహకార సంస్థల ద్వారా ఆత్మ నిర్భర భారత్ అనే అంశంపై సహకార వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాబు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి - మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, నాయకులు బెజ్జంకి డిగంబర్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News