ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : స్ట్రోం డ్రైనేజీతో పారిశుధ్య కష్టాలు తీరనున్నాయని, కాంట్రాక్టర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మరిపెడ మునిసిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ మునిసిపాలిటీ పరిధిలోని మునిసిపల్ పార్క్ రోడ్ నుంచి కార్గిల్ సెంటర్ వరకు సుమారు రూ.2కోట్లతో మంజూరైన స్ట్రోం డ్రైనేజీ నిర్మాణ పనులను 14 వార్డు కౌన్సిలర్ జాటోతు సురేష్ నాయక్ తో కలిసి ప్రారంభించారు.పట్టణ అభివృద్ది కోసం ఎప్పటికప్పుడు అహర్నిషలు కృషి చేస్తూ, ఫైనాన్స్ క్లీయరెన్స్ చేయిస్తున్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోడ రవి, గంధసిరి భిక్షపతి,అలువాల ఉపేందర్,యువ నాయకులు యాకన్న, వెంకట్ సాయి, మునిసిపాలిటీ వర్క్ ఇన్ స్పెక్టర్ వెంకట్ లాల్ తదితరులున్నారు.
Admin
E Nivas News