ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రెనుదో మంగళవారం కలిసి జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మరియు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాలకు గాను కేవలం 20 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు. బెజ్జూర్ మండలంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు కేటాయించలేదని అన్నారు. కాగజ్నగర్ డివిజన్లో కేవలం 11.11% సర్పంచ్ సీట్లు బీసీలకు కేటాయించారని, ఆసిఫాబాద్ డివిజన్లో కేవలం 7.21 % కేటాయించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీఓ మరియు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం బీసీలకు ఇవ్వాల్సిన 23 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని, దీనిని సరిదిద్దాలని జిల్లా కలెక్టర్ కువినతి పత్రం సమర్పించారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సర్పంచ్ స్థానాలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తం మీద కేవలం 9 శాతం సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు.వెంటనే ఈ బీసీ రిజర్వేషన్లలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్, అరుణ్ లోయ, అనిల్, గాజుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News