Friday, 17 April 2026 05:01:33 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం... భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, సిర్పూర్ ఎమ్మెల్యే

Date : 25 November 2025 11:42 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రెనుదో మంగళవారం కలిసి జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మరియు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాలకు గాను కేవలం 20 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు. బెజ్జూర్ మండలంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు కేటాయించలేదని అన్నారు. కాగజ్నగర్ డివిజన్లో కేవలం 11.11% సర్పంచ్ సీట్లు బీసీలకు కేటాయించారని, ఆసిఫాబాద్ డివిజన్లో కేవలం 7.21 % కేటాయించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీఓ మరియు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం బీసీలకు ఇవ్వాల్సిన 23 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని, దీనిని సరిదిద్దాలని జిల్లా కలెక్టర్ కువినతి పత్రం సమర్పించారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సర్పంచ్ స్థానాలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తం మీద కేవలం 9 శాతం సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు.వెంటనే ఈ బీసీ రిజర్వేషన్లలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్, అరుణ్ లోయ, అనిల్, గాజుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :