Friday, 31 July 2026 07:13:20 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్

పాల్గొన్న వంద మంది స్పెషల్ పార్టీ బలగాలు

Date : 10 February 2026 09:08 PM Views : 128

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పట్టణంలోని బొక్కలగూడ, అబ్దుల్లా చౌక్, ఖానాపూర్, అంబేద్కర్ నగర్, ప్రాంతంలలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో 100 మంది స్పెషల్ పార్టీ బలగాలు, పోలీసు సిబ్బంది పాల్గొని ప్రధాన వీధుల్లో మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయడంలోపోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే సోషల్ మీడియా వేదికలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక ఐపిఎస్, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు బి సునీల్ కుమార్, ఎం ప్రసాద్, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: