ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ (60)పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి ఆమె కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబానికి టేకూరి రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని సింగపూర్ దేశం నుండి అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు ఆమెకు సంతాపాన్ని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, ముద్దపాటి ప్రసాద్, రత్నాకర్, జీవన్న, సుబ్బారావు, వేమా రెడ్డి, బోనాల భాస్కర్, ఆంథోనీ, చిన్న హుస్సైనయ్య, దార సీరన్న, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News