ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం నియోజవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శుక్రవారం వెలుగోడు మండలంలోని, వేల్పనూరు గ్రామంలో నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రజలు ఇచ్చిన పలు వినతులు స్వీకరించారు. సమస్యల గురించి అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పలు సమస్యలకు పరిష్కరించడం జరిగింది. మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News