ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్-డి.నాగజ్యోతి నూతన సంవత్సరానికి అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాధిగస్తులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరెంటెండ్ డాక్టర్ ఏ.రాయుడు పర్యవేక్షణలో అవసరమైన రక్త, మూత్ర, గల్ల పరీక్షలను ఉచితంగా చేయించుకుని ఉచిత మందులు తీసుకొని, పౌష్టిక ఆహారాన్ని భుజించి ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలియజేశారు. ఆర్డిఓ డి.నాగజ్యోతి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, సిబ్బందితో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉన్న వ్యాధులస్తులకు ఆపిల్ ఆరెంజ్ పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, ఆర్డీవో సిసి- జగదీష్, నర్సింగ్ ఆఫీసర్ గీతా లక్ష్మి, నరసమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, హాస్పిటల్ సెక్యూరిటీ శివకుమార్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Admin
E Nivas News