ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణలోని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరియు మెరీబా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఎన్సిసి వాలంటీర్లు , ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కొరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని మరియు విద్యార్థులకు ఉద్దేశించి ఇన్చార్జి ప్రిన్సిపాల్ పద్మావతి భాయి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకొని, హెచ్ఐవి ఎయిడ్స్ లేని సమాజాన్ని రాబోయే కాలంలో చూడాలని దీనికి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క సామాజిక బాధ్యత అనుకొని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకొని మరియు తెలియజేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా మీకు మీరు కాపాడుకుని, ఇతరులకు కూడా ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం గౌడు సెంటర్లో మానవహారం చేసి విద్యార్థిని, విద్యార్థులతో, అన్ని శాఖల సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరెంటెండ్ డాక్టర్ ఏ.రాయుడు, హెల్త్ ఎడ్యుకేటర్ ధనలక్ష్మి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లు కృష్ణ, విద్యాసాగర్ ఎన్సిసి కోఆర్డినేటర్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఐసిటిసి కౌన్సిలర్ ప్రసాదు మరియు జబీబుల్లా, మేరీబా- టీఐ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ జుల్ఫికర్ అలీ ఖాన్, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, స్టాఫ్ నర్స్ భ్రమరాంబ, వైద్య సిబ్బంది,యువరాజు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News