Friday, 31 July 2026 08:13:13 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎర్రగూడూరు తెలుగు గంగా బ్రిడ్జిపై నాణ్యత లోపాలు

మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న

Date : 25 May 2026 09:34 AM Views : 133

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు:-పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామం వద్ద తెలుగు గంగ బ్రిడ్జిపై నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు కే.అంకన్న ఎర్రగూడూరు వద్ద తెలుగు గంగ బ్రిడ్జిపై పి ఎస్ కే కంపెనీ వారు వేసిన నేషనల్ హైవే ఎన్ హెచ్ 340 సి రోడ్డును పరిశీలించగా కాంక్రీట్ పోయి, లోపల ఉన్న కడ్డీలు బయటపడి రోడ్డు పాడవుతూ వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నన్నూరు చెక్పోస్ట్ నుండి ఆత్మకూరు రైస్ మిల్లుల వరకు పి ఎస్ కే కంపెనీ వారు వేసిన జాతీయ రహదారి నిర్మాణాల నాణ్యతను అధికారులు పట్టించుకోకపోవడం వలన అక్కడక్కడ ఇటువంటి నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డును నేషనల్ హైవే అధికారులు పరిశీలించి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కంపెనీవారు నాణ్యతగా వేసే విధంగా చూడాలని కోరారు. *ఎర్రగూడూరు తెలుగు గంగ బ్రిడ్జి ప్రాముఖ్యత* జాతీయ మాల మహానాడు కలబండి.అంకన్న మాట్లాడుతూ ఎర్రగూడూరు దగ్గర తెలుగు గంగ బ్రిడ్జి దగ్గర.. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అనేక వినాయక విగ్రహాలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు వినాయక విగ్రహాలు నిమజ్జనం ప్రతి సంవత్సరం చేస్తారు. మరియు ఇదే నూతన బ్రిడ్జి మీదుగా కర్నూలు నుండి విజయవాడ కి భారీ మెట్రిక్ టన్నుల లోడ్ లతో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వి జరిగినప్పుడు. నాణ్యత లోపం వలన ఏదైనా జరగరాని సమస్య జరిగితే బ్రీడ్ కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అమాయకపు ప్రజలను ఇలా బ్రిడ్జి లలో ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. *భానుముక్కల టర్నింగ్ దగ్గర హైవే వారు మూసివేసిన రహదారినీ వెంటనే తొలగించాలి- ప్రయాణాన్ని సురక్షితం చేయాలి* భానుముక్కల టర్నింగ్ దగ్గర హైవే వారు నిత్యం భానుముక్కల ప్రజలు అందరూ కలిసి ప్రతి రోజు ప్రయాణిస్తుంటారు. కాబట్టి హైవే వారు మూసినటువంటి రహదారిను వెంటనే తొలగించాలన్నారు. నేషనల్ హైవే అధికారులు, పి ఎస్ కే కంపెనీ వారు ప్రజలు ఇబ్బందులు కలుగ కుండా చూడాలని కోరడమైనది. అంతేకాకుండా ఎప్పటి నుండో పూర్వం నుండి కూడా ఇక్కడ బస్ స్టాప్ ఉన్నదన్నారు. ఇక్కడ ఒక భానుముక్కల ఒక్కటే కాదు బానకచర్ల , వేంపెంట, వెలుగోడు, నంద్యాల వరకు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారనీ మరియు మజారా గ్రామాలు కలిసి ఉన్నాయన్నారు. కాబట్టి ఇది ఇలాగే ఉంటే బారి ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఈ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న కోరడమైనది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :