ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సూపరెంటెండ్ డాక్టర్- ఏ.రాయుడు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ లక్ష్మీప్రసన్న జనరల్ సర్జరీ, డాక్టర్ మస్తాన్ వలి, డాక్టర్ చిరంజీవి రెడ్డి, డాక్టర్ రమేష్, అనుస్తిసియా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సుభాషిణి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ సౌజన్య రాణి, నర్సింగ్ ఆఫీసర్స్ రాఘవ, రెహనా, మానస, రజియా మరియు స్టాఫ్ అందరు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవా అవార్డ్స్ డాక్టర్- ఎ.రాయుడు చేతుల మీదుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మస్తాన్ వలి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, జూనియర్ అసిస్టెంట్ ఎం.కిరణ్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్ లు ఎం.రాఘవ కృష్ణ, సయ్యద్ రెహనా, ఫార్మసీ ఆఫీసర్ ఎల్లమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ కే.ప్రసాద్, జిడిఏ కే.తుఫాన్ కుమార్, ఎం.రాజశేఖర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మద్దిలేటి, ఎస్ఎస్ కే మేనేజర్ జబివుల్లా, సెక్యూరిటీ శివయ్య, శానిటేషన్ వింగ్ కుమారి లకు ఉత్తమ అవార్డులు అందడం జరిగింది. ఈ కార్యక్రమం నందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉద్యోగులందరూ, ఆత్మకూరు ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News