ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : కల్లూరు అర్బన్ లోని, 19వ వార్డు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్-భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు.చరితరెడ్డి తో ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, నాయకులతో కలిసి పాల్గొని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల నగదును పంపిణీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతినెల ఒకటవ తేదీన జీతాలు పడేవిధంగా పింఛన్ లబ్ధిదారులకు కూడా నగదు పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వలన ఎటువంటి ఆదరణలేని వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, ఒంటరి మహిళలకు తమ జీవనానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇంచార్జ్ పెరుగు పురుషోత్తం రెడ్డి, 19 వ వార్డు ఇన్చార్జి ప్రభాకర్ యాదవ్, కర్రీస్ రవి, యువ నాయకులు కార్యకర్తలు, మహిళలు, సచివాలయాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News