Friday, 17 April 2026 05:04:38 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

నందికొట్కూరు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పాములపాడు ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Date : 10 January 2026 11:39 PM Views : 161

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోనీ, జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం గ్రామ ప్రజల సహకారంతో గ్రామ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి తరిగోపుల నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురువ.ఎల్లయ్య, ఎస్సై- పి.తిరుపాలు హాజరయ్యారు. మొదటి బహుమతికి స్పాన్సర్లుగా జిల్లా బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ & తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కురువ రమేష్, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్.గోపాల్, మమతా క్లినిక్ డాక్టర్ ఎం.రాజు పాల్గొన్నారు. రెండో బహుమతికి స్పాన్సర్లుగా ఎస్విఎల్ రంజిత్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ కురువ నాగరాజు, మూడో బహుమతికి స్పాన్సర్లుగా టైలర్ లింగారెడ్డి, డిష్ రామచంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణకోట్కూరు వర్సెస్ లింగాల మధ్య జరిగిన ఇనాగ్రేషన్ మ్యాచ్‌కు రిబ్బన్ కటింగ్ చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి, క్రికెట్ పోటీలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కురువ వెంకటేశ్వర్లు, మిట్టకందాల గ్రామ సర్పంచ్ చింతల నారాయణ, వీరారెడ్డి, వెంకటస్వామి, తిమ్మయ్య, బాలస్వామి, యోహాన్, లోకేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రామ సుబ్బయ్య, పి.హుసేన్ భాష, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ జాల కృష్ణుడు, చెలిమిళ్ళ డేగల.లోకేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :