ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోనీ, జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం గ్రామ ప్రజల సహకారంతో గ్రామ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి తరిగోపుల నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురువ.ఎల్లయ్య, ఎస్సై- పి.తిరుపాలు హాజరయ్యారు. మొదటి బహుమతికి స్పాన్సర్లుగా జిల్లా బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ & తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కురువ రమేష్, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్.గోపాల్, మమతా క్లినిక్ డాక్టర్ ఎం.రాజు పాల్గొన్నారు. రెండో బహుమతికి స్పాన్సర్లుగా ఎస్విఎల్ రంజిత్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ కురువ నాగరాజు, మూడో బహుమతికి స్పాన్సర్లుగా టైలర్ లింగారెడ్డి, డిష్ రామచంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణకోట్కూరు వర్సెస్ లింగాల మధ్య జరిగిన ఇనాగ్రేషన్ మ్యాచ్కు రిబ్బన్ కటింగ్ చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి, క్రికెట్ పోటీలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కురువ వెంకటేశ్వర్లు, మిట్టకందాల గ్రామ సర్పంచ్ చింతల నారాయణ, వీరారెడ్డి, వెంకటస్వామి, తిమ్మయ్య, బాలస్వామి, యోహాన్, లోకేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రామ సుబ్బయ్య, పి.హుసేన్ భాష, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ జాల కృష్ణుడు, చెలిమిళ్ళ డేగల.లోకేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
E Nivas News