Friday, 17 April 2026 05:03:41 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

అక్రమాలకు పాల్పడుతున్న విలేజ్ బుక్కీపర్లపై చర్యలు తీసుకోండి

ఎంఆర్పిఎస్ డిమాండ్

Date : 03 March 2026 08:38 AM Views : 82

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల ఎంపీడీవో కి.వినతి పత్రం సమర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు... ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పొదుపు సంఘాల ఏర్పాటు చేసి గ్రామీణ నిరుపేద మహిళలను లక్షాధికారులను చేసే దిశగా మహిళలకు అవగాహన కల్పించి ప్రభుత్వ నిధులతోడ్పాటును అందిస్తూ ఐక్య సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐక్య సంఘాల పరిధిలో చదువుకున్న నిరుద్యోగులను బుక్కిపరులుగా నియమించింది‌. అయితే బుక్కిపరులుగా కొంతమంది పురుషులను నియమించడంతో. వారి వారి కుటుంబ సభ్యులను ఐక్య సంఘం లీడర్లుగా మరియు సిఎస్పీ.లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. కావున పొదుపు ఐక్య సంఘాల పరిధిలో బుక్కిపరులుగా పొదుపు గ్రూపులలో ఉన్న చదువుకున్న. మహిళలనే నియమించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ రాజు మాదిగ, మండల అధ్యక్షుడు రాంప్రసాద్ మాదిగ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు ప్రేమ రాజు మాట్లాడుతూ పురుషులు బుక్కీర్లుగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని చదువురాని మహిళలను అమాయకులను చేసి, వారికి మాయమాటలు చెప్పి లోన్ గడువు. ఆరు ఏడు నెలలు ఉండగానే, బ్యాంకర్లతోటి. కుమ్మక్కై గతంలో తీసుకున్న లోన్ 6 నెలలు అసలు వడ్డీ కట్టించడంతో పాటు బుక్కీపర్ల కమిషన్ డిమాండ్ చేస్తూ వారి పబ్బం గడుపుకొని లక్షల రూపాయల ప్రజాధనాన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లతో బుక్ కీపర్ లు కుమ్మక్కై. పొదుపు మహిళలతో వేలిముద్ర సంతకాలు వేయించుకొని. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పొదుపు మహిళలకు తెలియకుండానే స్వాహ చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటిపై. చర్యలు తీసుకోవాలని గతంలో వెలుగు ఏపీఎం కి ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా వారిపై ఎలాంటిచర్యలు తీసుకోనందునే..ఈరోజు ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా త్వరగా మేలుకొని చర్యలు చేపట్టకపోతే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దృష్టికి పొదుపు మహిళలతో కలిసి తీసుకొనివెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకనుండి అయినా మండల స్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి గ్రామసభలు ఏర్పాటు చేసి పొదుపు మహిళలకు అవగాహన కల్పించాలని కోరుచున్నాము. మండలంలో అక్రమాలకు పాల్పడుతున్న.బుక్ కీపర్ లను.వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బుక్ కీపర్లు. వారి ఇంటి దగ్గరే బుక్కులు రాయడం వల్లనే ఈ సమస్య పునరావృతం అవుతున్నది కాబట్టి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీవో కి మరియు ఏపీఎం కి తెలియజేస్తున్నాం అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై.చర్యలు. చేపట్టకపోతే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :