Thursday, 30 July 2026 11:46:22 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అక్రమాలకు పాల్పడుతున్న విలేజ్ బుక్కీపర్లపై చర్యలు తీసుకోండి

ఎంఆర్పిఎస్ డిమాండ్

Date : 03 March 2026 08:38 AM Views : 158

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల ఎంపీడీవో కి.వినతి పత్రం సమర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు... ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పొదుపు సంఘాల ఏర్పాటు చేసి గ్రామీణ నిరుపేద మహిళలను లక్షాధికారులను చేసే దిశగా మహిళలకు అవగాహన కల్పించి ప్రభుత్వ నిధులతోడ్పాటును అందిస్తూ ఐక్య సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐక్య సంఘాల పరిధిలో చదువుకున్న నిరుద్యోగులను బుక్కిపరులుగా నియమించింది‌. అయితే బుక్కిపరులుగా కొంతమంది పురుషులను నియమించడంతో. వారి వారి కుటుంబ సభ్యులను ఐక్య సంఘం లీడర్లుగా మరియు సిఎస్పీ.లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. కావున పొదుపు ఐక్య సంఘాల పరిధిలో బుక్కిపరులుగా పొదుపు గ్రూపులలో ఉన్న చదువుకున్న. మహిళలనే నియమించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ రాజు మాదిగ, మండల అధ్యక్షుడు రాంప్రసాద్ మాదిగ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు ప్రేమ రాజు మాట్లాడుతూ పురుషులు బుక్కీర్లుగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని చదువురాని మహిళలను అమాయకులను చేసి, వారికి మాయమాటలు చెప్పి లోన్ గడువు. ఆరు ఏడు నెలలు ఉండగానే, బ్యాంకర్లతోటి. కుమ్మక్కై గతంలో తీసుకున్న లోన్ 6 నెలలు అసలు వడ్డీ కట్టించడంతో పాటు బుక్కీపర్ల కమిషన్ డిమాండ్ చేస్తూ వారి పబ్బం గడుపుకొని లక్షల రూపాయల ప్రజాధనాన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లతో బుక్ కీపర్ లు కుమ్మక్కై. పొదుపు మహిళలతో వేలిముద్ర సంతకాలు వేయించుకొని. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పొదుపు మహిళలకు తెలియకుండానే స్వాహ చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటిపై. చర్యలు తీసుకోవాలని గతంలో వెలుగు ఏపీఎం కి ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా వారిపై ఎలాంటిచర్యలు తీసుకోనందునే..ఈరోజు ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా త్వరగా మేలుకొని చర్యలు చేపట్టకపోతే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దృష్టికి పొదుపు మహిళలతో కలిసి తీసుకొనివెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకనుండి అయినా మండల స్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి గ్రామసభలు ఏర్పాటు చేసి పొదుపు మహిళలకు అవగాహన కల్పించాలని కోరుచున్నాము. మండలంలో అక్రమాలకు పాల్పడుతున్న.బుక్ కీపర్ లను.వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బుక్ కీపర్లు. వారి ఇంటి దగ్గరే బుక్కులు రాయడం వల్లనే ఈ సమస్య పునరావృతం అవుతున్నది కాబట్టి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీవో కి మరియు ఏపీఎం కి తెలియజేస్తున్నాం అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై.చర్యలు. చేపట్టకపోతే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :