ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : గురువారం పాములపాడు ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్- ఎస్.లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72 వ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమములో ముఖ్య అతిథిగా పర్సన్ ఇంచార్జ్(చైర్మన్) రాయపాటి గోవిందు పాల్గొని, సహకార జెండాను ఆవిష్కరించి, సంఘ డైరెక్టర్లతో, సభ్యులతో, నాయకులతో, రైతులతో కలిసి సెల్యూట్ చేశారు. అనంతరం ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం చైర్మన్- రాయపాటి. గోవిందు, మేనేజింగ్ డైరెక్టర్- ఎస్ లక్ష్మణ్ నాయక్ లు మాట్లాడుతూ సొసైటీ అమలు చేస్తున్న అన్ని రకాల సేవలను తెలుసుకొని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సంఘ సభ్యులు సంఘంలో తీసుకున్న పంట రుణాలను మరియు బంగారు రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అబివృద్దికి సహకారం అందించాలని కోరారు. బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీతో రుణాలను ఇస్తున్నామని సంఘ సభ్యులు, ప్రజలు, రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్- ఎస్.లక్ష్మణ్ నాయక్, డైరెక్టర్లు బుక్క వెంకటస్వామి, చిన్న స్వామన్న, సొసైటీ సిబ్బంది ఎం.శ్రీనివాసులు, టీ.అశోక్, టి.విష్ణు, సంఘ సభ్యులు-జూటూరు నాయిని.మధు, నాయిని.కృష్ణయ్య ,తుమ్మలూరు వేంకటేశ్వర రెడ్డి, శ్రీకృష్ణ, ఇస్కాల లింగస్వామి, ప్రజాసంఘాల నాయకులు నూర్ భాషా సంఘం మండల అధ్యక్షుడు-పి.మౌలా హుస్సేన్, సీనియర్ విలేఖరి -వెంకటేశ్వరరావు, రైతులు ఎం.రవి, మేకల.భాస్కర్, భూషణం, శాంత, వెంకటేశ్వర్లు, ఆన్సర్ భాష, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News