ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు పై అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ సుధాకర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తెచ్చినటువంటి జీవో ను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రైతులు దగ్గర ఎస్ఆర్ఎంసి తెలుగు గంగపై ఉన్న బిల్లుకు గ్రావిల్ ను టన్నుల ప్రకారం అమ్ముతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని, ఎర్రగూడురు గ్రామ ఆంజనేయస్వామి గుడి దగ్గర చెక్ పోస్ట్ పెట్టి, అలాగే కొత్తమాడుగుల దగ్గర చెక్ పోస్ట్ పెట్టి బిల్లులు కూడా ఇస్తున్నారని ఆయన అన్నారు. వారు తెచ్చినటువంటి జీవో ప్రకారం కేవలం లైసెన్సు క్వారీలో ఉన్న గ్రావెల్స్ కు మరియు ఇసుక కు మాత్రమే బిల్లు ఇవ్వాలి కానీ ఈ సుధాకర ఇన్ఫ్రా కంపెనీ వారు ఒక ట్రాక్టర్ కు 350/- చొప్పున, ఒక ట్రిప్పర్ కు 2250/- చొప్పున వసూలు చేస్తూ రైతులకు, వెంచర్లకు అమ్ముతున్నారని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న జీవోలు, వాటి షరతులు జీవో పరిధిలు చూడకుండా తెలుగు గంగ అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలుగు గంగ అధికారులపై, అలాగే సంబందిత అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News