Sunday, 26 April 2026 12:25:54 AM
# భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్ # ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండొద్దు. # ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు కీలక మార్పులు చేశాం.. # ఈ నెల 27న ప్రజావాణి రద్దు # ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి

ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పి ఆర్ టి యు మహాధర్నా

Date : 22 April 2026 06:18 AM Views : 59

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సంఘం పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద, పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి ల అధ్యర్యంలో మహా ధర్నాను చేపట్టారు. వెయ్యి మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఉద్యోగ , ఉపాధ్యాయులకు మెరుగైన పిఆర్సి, ఐఆర్, పెండింగ్ డిఎ లు వంటి అంశాలపై హామీ ఇచ్చిన ఇంత వరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని వెంటేనే పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి, 30% ఐఆర్ చెల్లిస్తూ పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని కోరారు. పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల నిర్లక్ష్యం ఉద్యోగ, ఉపాధ్యాయుల పై అలాగే కొనసాగుతుందని, దీనిని అడ్డుకుంటామని, సిపిఎస్ రద్దు చేయాలని, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపు చేయాలి, మెమో 57 అమలు పరచాలని, 2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి మాట్లాడుతూ అనేక ఆశలతో ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2 సంవత్సరాలైన మన ప్రధాన డిమాండ్లను పెండింగ్ లో పెట్టడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా ఉందని, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు అన్ని చెల్లించాలని, రిటైర్ అవుతున్న ఉపాధ్యాయులకు వారి పదవీ విరమణ రోజే వారి చెందాల్సిన ప్రయోజనాలు చెల్లించాలని, ఎం టి ఎస్ ఉపాధ్యాయులైన 1998,2008 వారిని రెగ్యులర్ చేయాలని, డీఎస్సీ వారికి 12నెలల జీతం చెల్లించాలి అని కోరారు. అలాగే ఎయిడెడ్, మున్సిపల్, మోడల్ స్కూల్, గిరిజన సంక్షేమ, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చాలా పెద్ద ఎత్తున ఎండ ఉన్న కూడా కూడా, ఆ వేడినీ లెక్క చేయకుండా ఉపాధ్యాయులు నిరసన గళం ఎత్తారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్-25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా కి ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.భార్గవ రామయ్య, రాష్ట్ర నాయకులు కె.కృష్ణారావు, గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ్ రావు, ఇబ్రహీం, రాంపుల్ల రెడ్డి, మధుసూదన్, వై.వి.రమణయ్య, పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, హనుమంతు, రవీంద్ర రెడ్డి, జాకీర్, కె.శ్రీనివాసులు, ఎస్.యం. బాషా, జేసీ నరసింహులు, సుమియన్, జగదీశ్ బాబు, జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, మహిళా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :