ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో పులి గోర్లు స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు డిఎఫ్ఓ-విగ్నేష్ అప్పోవ్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ విగ్నేష్ అప్పోవ్ మాట్లాడుతూ కొత్తపల్లి మండలం నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ ఎస్ టి ఆర్) పరిధిలోని, ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డివిజన్లో మా అటవీ శాఖ అధికారులు పులి గోర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కొత్తపల్లి మండలం ఆత్మకూరు డివిజన్లో పులి గోర్లు ఉన్నట్లు మా అటవీ అధికారులకు ఖచ్చితమైన సమాచారం రావడంతో విచారణ జరిపిన కొత్తపల్లి మండలంలోని, ఎర్రమఠం గ్రామానికి చెందిన విష్ణు, గుమ్మడాపురం గ్రామానికి చెందిన మురళీలను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. వారి వద్ద నుండి పులి గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో పులిని వేటాడి చంపినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. పులి సహజ మరణం పొందిన తర్వాత దాని కళేబరం నుండి గోర్లను సేకరించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోందనీ అన్నారు. పూర్తి విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీధి శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News