ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ యం- శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు నియోజవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త. జయసూర్య మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేటు విద్యాసంస్థలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ విద్యాబోధన చేస్తారన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు వేయాలన్నారు. ప్రతి ఒక్కరు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు.మీరు బాగా చదువుకోవడం వల్ల మన స్కూల్ కి, మన ఊరికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అంతేకాకుండా మన భారత దేశానికి బాలికల క్రీకెట్ జట్లు విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాబట్టి వీరికోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పథకమని అన్నారు. ప్రతి ఒక్క తల్లితండ్రులు విద్యార్థులను స్కూల్ కి పంపించాలనీ, బాగా చదువుకోనీ ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాసేలా మూల్యాంకన పుస్తకాలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయా అంటూ ఎమ్మెల్యే తల్లిదండ్రులను అడగడం జరిగింది. తల్లిదండ్రులుగా మీరు ప్రతి సారి మీటింగ్ లకు వచ్చారా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు చదువు బాగా చెప్తున్నారా ?, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల లోనే తమ పిల్లలను చేర్పించి, మన బడిని కాపాడాలని కోరారు. అనంతరం విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజననంను ఎమ్మెల్యే గిత్త.జయసూర్య వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ- యన్.చంద్రశేఖర్, ఎస్ఐ- కె.సురేష్ బాబు, ఎంఈఓ- బాలాజీ నాయక్, పాములపాడు సొసైటీ ఛైర్మన్ సి.గోవిందు, మద్దూరు సొసైటీ ఛైర్మన్, వాడాల జనార్ధన్ రెడ్డి, డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు చెల్లె.హరినాథరెడ్డి, బండ్లమూరీ. వెంకటేశ్వరావు, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామ సుబ్బమ్మ, టిడిపి నాయకులు బోనపల్లె.వినయ్, జిల్లా పరిషత్ హైస్కూల్ డ్రిల్లు మాస్టర్ పిడి- రాజశేఖర్, ఉపాధ్యాయులు ద్రాక్షాయిని బాయి , దామరేకుల.రవి, విజయలక్ష్మి, రాంప్రసాద్, సాయిరాం, నాయుడు, తదితర ఉపాధ్యాయులు, భవిత పాఠశాల ఉపాధ్యాయులు శంషుద్దీన్ , రామ్మూర్తి, హెల్త్ సిబ్బంది సి హెచ్ ఓ- జి.అన్నమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, బి.మాధవి, ఆశ వర్కర్లు దేవమణి, వెంగమ్మ,మరియు మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News