Friday, 31 July 2026 07:11:08 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఓపెన్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..! వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 13 February 2026 09:38 PM Views : 101

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ఎన్‌టీఆర్ జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీవోఎస్ఎస్‌) ఇంట‌ర్మీడియెట్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు బృంద స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి.. ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఓపెన్ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మావేశం జ‌రిగింది. పాఠ‌శాల విద్య‌, రెవెన్యూ, పోలీస్‌, ప్ర‌జా ర‌వాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌, పోస్ట‌ల్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ మార్చి- 2 నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఏపీవోఎస్ఎస్ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్నారు. విజ‌య‌వాడ డివిజ‌న్‌కు సంబంధించి 603 మంది, నందిగామ‌కు సంబంధించి 882 మంది, తిరువూరుకు సంబంధించి 369 మంది మొత్తం 1,854 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతార‌న్నారు. వీటికోసం 11 ప‌రీక్ష కేంద్రాల‌ను సిద్ధం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి చీఫ్ సూప‌రింటెండెంట్లను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. 144 సెక్ష‌న్ అమ‌లు, బందోబ‌స్తు ఏర్పాటు, భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, సీసీ కెమెరాల నిఘా విష‌యంలో పోలీసు శాఖ‌తో స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌న్నారు. మూడు ఫ్ల‌యింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాల‌న్నారు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు స‌కాలంలో ప‌రీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్ర‌జా ర‌వాణా అధికారులు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌న్నారు. నో సెల్‌ఫోన్ జోన్ నిబంధ‌న‌ల‌కు క‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని, ప్రాథ‌మిక చికిత్స కిట్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా స‌న్న‌ద్ధంగా ఉండాల‌న్నారు. తాగునీరు, పారిశుద్ధ్యంపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని సూచించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను కూడా విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని, ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మావేశంలో డీఆర్‌వో ఎం ల‌క్ష్మీన‌ర‌సింహం, డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :