Thursday, 30 July 2026 12:39:52 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మాక్ అసెంబ్లీకి వెళ్లిన వెంకటాపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థి రాజశేఖర్ కు ఘనంగా సన్మానం

Date : 28 November 2025 09:04 PM Views : 253

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండల పరిధిలోని, వెంకటాపురం జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థి భాషపోగుల.రాజశేఖర్, మాక్ అసెంబ్లీ ఎన్నికై, డిప్యూటీ స్పీకర్ గా రాణించారు. ఈ కార్యక్రమం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జవహర్ నాయక్ ఆధ్వర్యంలో ఆత్మకూరు టౌన్ సిఐ- డి.రాము విద్యార్థి భాషపోగుల.రాజశేఖర్ కు ప్రజాసంఘాల నాయకులతో కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ్ఞాపికను చేతికి అందించి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు అర్బన్ సిఐ-డి. రాము మాట్లాడుతూ ఉన్నతమైన చదువులు చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువు పేదరికం నిర్మూలన చేస్తుందని అన్నారు. చదువు సమాజంలో మంచి గౌరవాన్ని హోదాను ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ బాలాజీ నాయక్, మురళి నాయక్, హనుమంతు నాయక్, కృష్ణయ్య, ఈశ్వర్ నాయక్, వి.పుల్లయ్య, బి.వి.రమణ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :