ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకూరు మండలం అమలాపురం చెంచుగూడెం కాలనీ నందు ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ రసూల్ ఆధ్వర్యంలో 5వ స్వర్ణిమ సంవత్సరం సహకార సంఘాల వారోత్సవాల సందర్భంగా చెంచు కుటుంబాలకు మందులు, పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రవీంద్రబాబు లు పాల్గొని, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ నందు అనేక రకములైన సబ్సిడీ లోన్లు, వారికి కావలసిన పనిముట్లకు తక్కువ వడ్డీతో రుణాలు ఉన్నాయని ప్రతి ఒక్క రైతు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీరి వెంట బ్యాంక్ సూపర్వైజర్ సాయి, ఆత్మకూరు, పాములపాడు, వేంపెంట, నాగంపల్లి సీఈఓ లు శివకుమార్, ఎస్.లక్ష్మణ్ నాయక్, సునీల్ రెడ్డి, శ్రీరాములు సిబ్బంది సురేంద్ర, రియాజ్, శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News