ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య ను ఐఎఫ్ డబ్యూజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలనీ ఐఫ్డబ్యూజె యూనియన్ తరపున డిమాండ్ చేస్తుందనారు. హత్యకు సంభంధించి ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్. మృతుడి కుటుంబానికి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం అందించాలని , మృతునీ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు, హై కోర్టులు జర్నలిస్ట్ ల పై దాడులను కండిస్తూ ఎన్ని సెక్షన్ లు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్ట్ రక్షణ చట్టం తేవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి . రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇక జర్నలిస్టుల పై ఏటువంటి దాడులు జరిగిన చూస్తూ ఊరుకోమనారు. ఆసాంఘిక శక్తుల పై చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Admin
E Nivas News