ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : *శాలువాలు కప్పి, అభినందించి, ఘనంగా సన్మానం చేసిన ఆత్మకూరు మజ్లిసుల్ ఉలేమా, ఆత్మకూరు మస్జీద్ కమిటీల ముతవల్లీలు, మత పెద్దలు* 50 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వారి ఆధ్వర్యంలో ఉన్న ముల్లా కుటుంబం ఆత్మకూరు ఖబరస్థాన్ కు వితరణ చేయడం సంతోష దాయకమని ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ మౌలానా జాకీర్ సాబ్ రషాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఉన్న ఈ స్థలం నిరుపయోగంగా ఉండడం మరియు తగిన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనించిన ముల్లా కుటుంబానికి చెందిన ఖమృన్ బి, బి.సలాం, బి.మక్బుల్ లు ఈ స్థలాన్ని ఆత్మకూరు ఖబ్రస్థాన్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట మసీదు నందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందించవలసినదిగా తెలిపారు. అల్లా మార్గంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో సేవా కార్యక్రమాలకు ముందుండాలని, మహమ్మద్ ప్రవక్త నేర్పిన సన్మార్గంలో, అందరికీ ఆదర్శంగా నలుగురికి సాయం చేసేలా నడవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు పట్టణానికి చెందిన మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు- రహంతుల్లా మౌలానా, మజ్లిసుల్ ఉలేమా ప్రధాన కార్యదర్శి- ముఫ్తీ నూర్ మొహమ్మద్(ఆత్మకూరు), ఆలిమ్ లు జబీవుల్లా మౌలానా (ఆత్మకూరు), ఇలియాజ్ మౌలానా, ముర్తుజా మౌలాన, వివిధ మసీదుల కమిటీల ముతవల్లీలు, ఆత్మకూరు ముస్లిం మత పెద్దలు మరియు పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొని, ఆ కుటుంబాన్ని అభినందించారు.
Admin
E Nivas News