ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ లో నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, వంటగది చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల. నాగరాజు మాట్లాడుతూ పిల్లలకు మెనూ ప్రకారం భోజనం నాణ్యతగా వండి పెట్టాలన్నారు. తాజా కూరగాయలు ఎప్పటికప్పుడు తెచ్చి ఉండాలన్నారు. మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పిల్లలకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందని, పిల్లలను బాగా చూసుకోవాలని అన్నారు. వంటగది చుట్టూ పరిసర ప్రాంతాలు బాగాలేవని వెంటనే వంట గది చుట్టూ మురుగునీరు లేకుండా చూసుకోవాలని, దానివల్ల పిల్లలకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.లేదంటే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News