ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో స్వల్పకాలిక ఋణం తీసుకొని రోడ్డు ప్రమాదం లో మరణించిన మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన ఉడుత చంద్రయ్య కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు మంజూరు కాగా, సంఘ అఫీషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ కెడిసిసి బ్యాంకు మేనేజర్ కె.ఉదయశ్రీ, డిఈ సందేబోయిన శ్రీనివాస్ తో కలిసి సోమవారం సాయంత్రం అతని భార్య స్వరూప కు అందజేశారు. సంఘం యందు స్వల్ప కాలిక ఋణం తీసుకున్న ప్రతీ ఒక్క రైతుకు సహకార సంఘం ద్వారా ప్రమాద భీమా సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ ముస్కుల ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ పొయిల రాజయ్య, నాయకులు కావటి సమ్మయ్య, సందీప్, బుదారపు సతీష్, నాంపల్లి రంజిత్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News