Thursday, 30 July 2026 10:15:08 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

దుబ్బాక మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.వివేక్

Date : 13 January 2026 10:43 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మెన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం, సన్మాన కార్యక్రమంలో మంగళవారం కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మెన్, సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డులలో టీఐఎఫ్‌డీసీ నిధుల ద్వారా రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి టీఐఎఫ్‌డీసీ ద్వారా రూ.10 కోట్ల నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీఐఎఫ్‌డీసీ నిధులు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళా రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రూ.2 లక్షల రుణ మాఫీ అందని వారి వివరాలను లిస్టు ఇవ్వాలని సూచించారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యారంటీ కార్డులు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :