ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రమాదాల జరగకుండా వాటిని నివారించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఎసిపి ప్రకాష్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహన పత్రాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఉంచుకోవాలని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించినప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని వాహనదారులకు తెలిపారు. అనంతరం వాహనదారులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లక్షట్ పేట సిఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News